IND T20I Series Vs WI:Rohit Sharma, Virat Kohli, Rishabh Pant And Hardik Pandya Likely To Play In T20I Series Vs WI says Reports | వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఇదివరకే జట్టును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జట్టుు శిఖర్ ధావన్ సారథ్యాన్ని వహించనున్నాడు. రవీంద్రజడేజా మినహా సీనియర్లెవరికీ వన్డే జట్టులో చోటు కల్పించలేదు.తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు బీసీసీఐని పునరాలోచనలో పడేశాయి. టీ20ల్లో బంగ్లాదేశ్పై వెస్టిండీస్ తిరుగులేని విజయాలను సాధించడాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. విండీస్ ప్లేయర్లు ఫుల్ ఫామ్లో ఉన్నందున.. తన నిర్ణయాన్ని మార్చుకోనుంది. సీనియర్లను మళ్లీ జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ తెలుస్తోంది. వెస్టిండీస్తో అయిదు టీ20 మ్యాచ్లను ఆడాల్సి ఉన్నందున- రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యాలను మళ్లీ జట్టులో చోటు కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. ఈ మూడు వన్డేల సిరీస్ ముగిసిన వెంటనే టీ20ల కోసం ప్రకటించే జట్టులో సీనియర్లను తీసుకుంటోందని సమాచారం. <br /> <br /> <br /> <br />#INDVSWIT20Iseries <br />#rohitsharma <br />#indvseng <br /> <br />
